News October 24, 2024

29న నిజామాబాద్ జిల్లాకు బీసీ కమిషన్‌ బృందం రాక

image

నిజామాబాద్ జిల్లాకు ఈ నెల 29న బీసీ కమిషన్‌ బృందం రానుంది. రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనపై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారు జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటలకు బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ ఆధ్వర్యంలో సమావేశం జరుగనుందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 30, 2025

ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

News December 30, 2025

హైదరాబాద్‌పై నిజామాబాద్ గెలుపు

image

కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నీలో NZB జట్టు HYDపై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన NZB జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన HYD జట్టు 9 వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో NZB జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.

News December 30, 2025

మెండోరా: ట్రాక్టర్ ఢీకొని టీచర్ మృతి

image

మెండోరా మండలం పోచంపాడ్ సమీపంలో తెలంగాణ సొషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో టీచర్‌గా పని చేస్తున్న ప్రియాంక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు. బైక్ మీద వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టిందన్నారు. చికిత్స నిమిత్తం నిర్మల్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారన్నారు