News January 11, 2026

29, 30న ఉప లోకాయుక్త క్యాంప్ సిట్టింగ్

image

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీ ఉప లోకాయుక్త పి.రజని ఆధ్వర్యంలో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఈ క్యాంప్‌లో పాల్గొని ప్రభుత్వ అధికారుల అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కొత్త ఫిర్యాదులు అందజేయవచ్చునని ఆమె తెలిపారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 21, 2026

లైఫ్ ఇన్సూరెన్స్: ప్రీమియం చెల్లింపులో జాప్యం చేస్తే..?

image

టర్మ్ ఇన్సూరెన్స్‌ నెలవారీ ప్రీమియానికి 15రోజులు, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేందుకు 30రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అవుతుందని గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ MD సబ్యసాచి తెలిపారు. ‘దీంతో క్లయింట్లు కవరేజీ కోల్పోతారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరిస్తాయి. అందుకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి’ అని వివరించారు.

News January 21, 2026

సంగారెడ్డి: ‘భూభారతి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి’

image

సంగారెడ్డి జిల్లాలో భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

News January 21, 2026

అన్నమయ్య: మైనర్‌పై 75ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం.. చివరికి.!

image

అన్నమయ్య జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 75 ఏళ్ల వృద్ధుడికి కడప పోక్సో కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధించింది. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన ఈ కేసులో నేరం రుజువైంది. సమర్థవంతమైన దర్యాప్తుతో శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను జిల్లా SP ధీరజ్ అభినందించారు. మహిళలు, పిల్లల రక్షణలో రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు.