News November 2, 2024

ఆకలి అన్నందుకు 29 మంది చిన్నారులకు మరణశిక్ష! కానీ..

image

నైజీరియాలో ఆహార నిల్వలు అడుగంటడంతో తిండి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా పలు ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు మరణశిక్ష విధించింది. అందులో 29 మంది మైనర్లున్నారు. కాగా బాలల హక్కు చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని మరణ శిక్ష రద్దుచేసి, ₹5లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

Similar News

News October 28, 2025

పునరావాస కేంద్రాల్లో ఆహారం, దుప్పట్లు పంపిణీ

image

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.

News October 28, 2025

TETపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: లోకేశ్

image

AP: టీచర్ల వినతి మేరకు TET తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. 2010కి ముందు ఎంపికైన టీచర్లూ టెట్ పాసవ్వాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వారు ఆవేదనలో ఉన్నారని MLCలు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ విధంగా స్పందించారు. టెట్ పాస్ కాకుంటే పోస్టుకు అనర్హులనడంతో ఆందోళనకు గురవుతున్నారని నేతలు చెప్పారు. కాగా తాజా TET మాత్రం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

News October 28, 2025

మూవీ అప్డేట్స్

image

* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘డెకాయిట్’ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల
* నవీన్ పొలిశెట్టి, రవితేజ కాంబినేషన్లో సినిమా.. ప్రసన్న కుమార్ కథకు Ok చెప్పిన హీరోలు!
* తిరువీర్ హీరోగా తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ రిలీజ్.. NOV 7న మూవీ రిలీజ్
* ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవంత్‌కు పెళ్లి కానుకగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత మాగేశ్ రాజ్