News September 7, 2024

రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను ప్రభుత్వం వరద బాధిత జిల్లాలుగా ప్రకటించింది. ఈ లిస్టులో సిరిసిల్ల, HYD, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు CS శాంతికుమారి తెలిపారు. మిగతా 25 జిల్లాలకు ₹3కోట్ల చొప్పున విడుదల చేస్తామని పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 24, 2025

మల్లె సాగు – అనువైన రకాలు

image

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.

News October 24, 2025

APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 పోస్టులు

image

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్‌ లెవల్‌లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/

News October 24, 2025

అఫ్గాన్ బార్డర్లు క్లోజ్.. పాక్‌లో కేజీ టమాటా రూ.600

image

ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్గాన్-పాక్ బార్డర్లు ఇటీవల మూసేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మందుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాక్‌లో టమాటాల ధరలు 5 రెట్లు పెరిగి కిలో 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతున్నాయి. యాపిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వ్యాపారం స్తంభించిపోయిందని, 2 దేశాలు రోజుకు $1M నష్టపోతున్నాయని అక్కడి వ్యాపార వర్గాలు తెలిపాయి.