News September 7, 2024
రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను ప్రభుత్వం వరద బాధిత జిల్లాలుగా ప్రకటించింది. ఈ లిస్టులో సిరిసిల్ల, HYD, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు CS శాంతికుమారి తెలిపారు. మిగతా 25 జిల్లాలకు ₹3కోట్ల చొప్పున విడుదల చేస్తామని పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 28, 2025
ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.
News December 28, 2025
బుల్డోజర్ వివాదం.. సీఎం Vs సీఎం

బెంగళూరులో ఇళ్ల కూల్చివేత కర్ణాటక, కేరళ CMల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ‘నార్త్ బుల్డోజర్ జస్టిస్’ను కర్ణాటక అనుసరిస్తోందని కేరళ CM విజయన్ ఆరోపించారు. ముస్లిం ఇళ్ల కూల్చివేతలు మైనారిటీ వ్యతిరేక రాజకీయాలకు ఉదాహరణని మండిపడ్డారు. ‘ఆయనవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు. వాస్తవ పరిస్థితిపై అవగాహన లేకుండా మాట్లాడారు. బుల్డోజర్ న్యాయానికి, ఆక్రమణల తొలగింపునకు తేడా ఉంది’ KA CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు.
News December 28, 2025
వాళ్లు బట్టతల ఉన్నోళ్లకూ దువ్వెన అమ్మగలరు: దిగ్విజయ్

అద్వానీ, మోదీ <<18686086>>ఫొటోను<<>> కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ షేర్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనపై వచ్చిన విమర్శలపై దిగ్విజయ్ స్పందించారు. సంఘ్ భావజాలాన్ని వ్యతిరేకిస్తానని, ఆ సంస్థ రాజ్యాంగాన్ని ఫాలో కాదని ఆరోపించారు. RSS కార్యకర్తలు బట్టతల ఉన్న వ్యక్తులకూ దువ్వెనలు అమ్మగలరని ఎద్దేవా చేశారు. వాళ్లు చాలా తెలివైన వాళ్లని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలా పని చేయాలన్నారు.


