News December 18, 2025
2,93,587 పంపు సెట్లకు పగటి వేళే విద్యుత్: CS

AP: గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పూర్తయితే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గేందుకు వీలుకలుగుతుందని CS విజయానంద్ అభిప్రాయపడ్డారు. PM-KUSUM స్కీమ్ కింద వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా 2,93,587 అగ్రి పంపులకు పగలే 9 గంటలు విద్యుత్ అందించేలా పనులు కేటాయించామన్నారు. ‘స్కీమ్లో చేపట్టిన ప్రాజెక్టులతో 3 ఏళ్లలో ₹2,368 కోట్ల మేర పొదుపు అవుతుంది. తద్వారా టారిఫ్లూ తగ్గుతాయి’ అని కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
శ్రీవారిని దగ్గర నుంచి చూడాలంటే?

సాధారణ భక్తులు 70 అడుగుల దూరం నుంచి స్వామిని చూస్తే, లక్కీడిప్లో ఎంపికైన వారు 9 అడుగుల దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఆన్లైన్ లక్కీడిప్లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. అందుకే మీరు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ నేరుగా ‘ఆఫ్లైన్ లక్కీడిప్’లో నమోదు చేసుకుంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్కు రూ.10 వేలు డొనేట్ చేయడం వల్ల కూడా మొదటి గడప దర్శన భాగ్యం లభిస్తుంది.
News December 19, 2025
ఇంగ్లిస్ విషయంలో PBKS ఆగ్రహం!

IPLలో 4 మ్యాచులే ఆడతారని తెలియడంతో PBKS ఇంగ్లిస్ను రిలీజ్ చేయగా, మినీ వేలంలో LSG రూ.8.6CRకు దక్కించుకుంది. కాగా ఇంగ్లిస్ APR 18న పెళ్లి చేసుకొని వెంటనే IND వస్తారని, హనీమూన్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దీంతో PBKS బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకీ విషయం తెలిస్తే వదిలేవాళ్లం కాదంటోంది. అయితే ఇంగ్లిస్-BCCI మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగిందా? ప్లేయర్ ప్లాన్స్ మార్చుకున్నారా అనేది తెలియాలి.
News December 19, 2025
ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


