News October 6, 2025

2nd గ్రేడ్ టమాటాలు పారబోసి గందరగోళం సృష్టించారు: అచ్చెన్న

image

AP: టమాటా రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్న తెలిపారు. దసరా సెలవులతో పత్తికొండ మార్కెట్‌కు మామూలుగా వచ్చే 40 టన్నులకు అదనంగా 10 టన్నుల పంట ఇటీవల వచ్చిందన్నారు. అయితే కొందరు గ్రేడ్‌2 క్వాలిటీ టమాటాలను పారబోసి గందరగోళానికి యత్నించారని విమర్శించారు. ఇక్కడ KG ధర రూ.9 నుంచి 18 వరకు పలుకుతోందన్నారు. టమాటాలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తామని చెప్పారు.

Similar News

News October 6, 2025

RECORD: 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

image

దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.1,57,400గా ఉంది.

News October 6, 2025

మరణ భయాన్ని పోగొట్టే శివ మహా పురాణం

image

మానవ జీవితంలో మరణ భయాన్ని మించిన భయం మరొకటి లేదు. అటువంటి భయాన్ని సమూలంగా పోగొట్టే దివ్యౌషధం శివ మహాపురాణం. దీనిని కేవలం శ్రవణం చేస్తేనే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. సమస్త వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన, యోగాదుల జ్ఞానానికంతటికీ సారభూతమైంది ఈ పరమ పవిత్రమైన పురాణం. ఈ గ్రంథ పారాయణం శివ తత్వాన్ని బోధించి, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. <<-se>>#SIVOHAM<<>>

News October 6, 2025

ఆకాశం నుంచి బంగారు వర్షం.. ఎప్పుడంటే?

image

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1944, ఏప్రిల్ 14న ముంబైలోని విక్టోరియా డాక్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బ్రిటన్ నౌక ‘ఫోర్ట్ స్టికిన్’ తునాతునకలైంది. దీంతో అందులోని 3,50,000 కిలోల బంగారు బిస్కెట్లు గాల్లోకి ఎగిరి వర్షంలా కురిశాయి. వందల మీటర్ల దూరంలో ఇవి ఎగిసిపడటంతో ప్రజలు వీటికోసం పరుగులు తీశారు. అయితే ఓడలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలుండటంతో భారీ విస్పోటనం జరిగి 800 మందికి పైగా చనిపోయారు.