News March 28, 2024
2న శ్రీవారి ఆలయంలో తిరుమంజనం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం జరగనుంది. ఈక్రమంలో ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Similar News
News September 29, 2024
చిత్తూరు: జిల్లా ప్రజలకు గమనిక.
అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 2,69,677 మందికి సుమారు రూ.113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 1వ, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినంతో 3 వ తేదీ పంపిణీ చేస్తామని చెప్పారు.
News September 29, 2024
శ్రీవారి సేవకు రూ.కోటి టికెట్
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో ఉన్నారు. అలావచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నోరకాల ఆర్జితసేవలు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకమైన సేవ ఒకటి ఉంది. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈసేవ టికెట్ ధర అక్షరాల రూ.కోటి. ఈటికెట్ కొనుగోలుచేసిన భక్తులు ఆరోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం అష్టదళపాదపద్మారాధన ఉంటుంది. వివరాలకు TTD వెబ్సైట్ను సందర్శించవచ్చు.
News September 29, 2024
తిరుపతి: పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైనట్టు జనసేన నాయకులు తెలిపారు. అక్టోబర్ 2న సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారని చెప్పారు. అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి 9 గంటలకు తిరుమల చేరుకుంటారని చెప్పారు. 3వ తేదీ స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ఆరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభకు హాజరవుతారని చెప్పారు.