News October 2, 2024
3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
Similar News
News October 16, 2025
17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.
News October 16, 2025
కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.
News October 16, 2025
తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.