News November 26, 2025

3 ముక్కలుగా పుంగనూరు..!

image

మదనపల్లె జిల్లాలోకి పుంగనూరును మార్చనున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 6మండలాలను 3రెవెన్యూ డివిజన్ల పరిధిలోకి చేర్చనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మండలాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. సోమల, సదుం కొత్త డివిజన్ పీలేరులో కలుస్తాయి. పులిచెర్ల, రొంపిచర్ల మండలాలను చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారు.

Similar News

News February 16, 2026

కార్మికులకు పింఛను సౌకర్యం

image

రోజువారి కూలీలతో జీవనం సాగించే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. వయసును బట్టి నెలకు ప్రీమియం రూ. 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల అనంతరం నెలవారి రూ. 3 వేలు పింఛను వస్తుంది. లబ్ధిదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50% పింఛన్ చెల్లిస్తారు.

News February 16, 2026

కుప్పం: ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా సిలిండర్ కొనాల్సిందే..!

image

కుప్పం GH లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా ఆసుపత్రి వారు మాత్రం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో కుప్పం GH కు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంటును అందజేశారు. అయితే అప్పటి YCP ప్రభుత్వం సైతం మరో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 2 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో మరమ్మతులు కాగా సుమారు ఏడాదికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.

News February 16, 2026

కుప్పం: ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా సిలిండర్ కొనాల్సిందే..!

image

కుప్పం GH లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా ఆసుపత్రి వారు మాత్రం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో కుప్పం GH కు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంటును అందజేశారు. అయితే అప్పటి YCP ప్రభుత్వం సైతం మరో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 2 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో మరమ్మతులు కాగా సుమారు ఏడాదికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.