News June 22, 2024
3 రోజులు పిఠాపురంలోనే డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో పిఠాపురం రానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ తొలిసారి పిఠాపురం వస్తుండటంతో నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉండనుండగా.. మూడురోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండనున్నారట. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారంతో సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
Similar News
News July 9, 2025
రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.
News July 9, 2025
రాజమండ్రి: ఆర్టీసీలో 9 మందికి కారుణ్య నియామకాలు

ఉమ్మడి తూ.గో జిల్లాలో మంగళవారం ఆర్టీసీలో కారుణ్య నియామకాలు జరిగాయి. సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు ఈ నియామకాలు జరిగాయి. స్థానిక ఆర్ఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తూ.గో జిల్లా డీపీటీవో వైఎస్ఎన్ మూర్తి , కాకినాడ డీపీటీవో ఎం. శ్రీనివాసరావు, కోనసీమ డీపీటీవో రాఘవ కుమార్లు పాల్గొని 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
News July 9, 2025
అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల అక్రమ నిల్వలు ఎవరు కలిగి ఉన్నా ఉపేక్షించేది లేదని, ఆయా షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” లో భాగంగా మంగళవారం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు100 గజాల దూరంలో ఉన్న షాపులలో పొగాకు, గుట్కా నిల్వల పై సోదాలు చేసి కేసులు పెట్టమన్నారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు.