News January 11, 2025

కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 3.4 లక్షల మంది మృతి!

image

శీతలపానీయాలు (Sugar-Sweetened Beverages) తాగడం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. SSBల వల్ల అధిక బరువు, షుగర్ వస్తుందని, కొలెస్ట్రాల్& బీపీ పెరిగి గుండె జబ్బులొస్తాయని తెలిపారు. అనారోగ్యం పాలై 2020లో 3.4 లక్షల మంది చనిపోయారన్నారు. పట్టణ యువత, చదువుకున్నవారే ఇవి అధికంగా సేవిస్తున్నారు. శుద్ధమైన నీరు అందుబాటులో ఉంటే శీతలపానీయాలను తాగొద్దని సూచించారు. SHARE IT

Similar News

News November 13, 2025

రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

image

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.

News November 13, 2025

టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

image

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్‌లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్‌లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్‌లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్‌తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.

News November 13, 2025

రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

తెలంగాణలో ఇవాళ తెల్లవారుజామున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లోని సిర్పూర్‌లో కనిష్ఠంగా 7.1, తిర్యానీలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇక HYD శివార్లలోని ఇబ్రహీంపట్నంలో 11.5, శేరిలింగంపల్లి(HCU)లో 11.8, రాజేంద్రనగర్‌లో 12.9, మారేడ్ పల్లిలో 13.6 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయినట్లు పేర్కొన్నారు. రాబోయే 4-5 రోజుల్లో చలిగాలులు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.