News January 11, 2025
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 3.4 లక్షల మంది మృతి!

శీతలపానీయాలు (Sugar-Sweetened Beverages) తాగడం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. SSBల వల్ల అధిక బరువు, షుగర్ వస్తుందని, కొలెస్ట్రాల్& బీపీ పెరిగి గుండె జబ్బులొస్తాయని తెలిపారు. అనారోగ్యం పాలై 2020లో 3.4 లక్షల మంది చనిపోయారన్నారు. పట్టణ యువత, చదువుకున్నవారే ఇవి అధికంగా సేవిస్తున్నారు. శుద్ధమైన నీరు అందుబాటులో ఉంటే శీతలపానీయాలను తాగొద్దని సూచించారు. SHARE IT
Similar News
News November 12, 2025
అండ దానం గురించి తెలుసా?

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్ డొనేషన్కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్ చేయాలి.
News November 12, 2025
26/11 తరహా దాడులకు ప్లాన్?

2008లో ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ టెంపుల్ సహా ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే రోజు దాడులకు ప్లాన్ చేశారని, కట్టుదిట్టమైన భద్రత, నిఘా వల్ల ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పాయి.
News November 12, 2025
కుటుంబం అంతమైనా బుద్ధి మారలేదు!

ఆపరేషన్ సిందూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ <<17727105>>కుటుంబం<<>> అంతమైనా ఆ ఉగ్రవాద సంస్థ బుద్ధి తెచ్చుకోవట్లేదు. తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనతో JeM లింకులు బయటపడ్డాయి. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్పై అటాక్స్, 2019 పుల్వామా అటాక్లో వందలాది అమాయకులను ఆ టెర్రరిస్టులు పొట్టనబెట్టుకున్నారు. JeM నాయకత్వ వికేంద్రీకరణ, పాక్ ISI సపోర్ట్తో రెచ్చిపోతున్నారు.


