News April 6, 2025
వరుసగా 3 రోజులు సెలవులు

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. అటు ఈనెల 10న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉంది. 18న గుడ్ ఫ్రైడే రోజు సెలవు ఉండనుండగా, 30న బసవ జయంతి రోజున ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా పేర్కొంది.
Similar News
News February 16, 2026
పాక్పై విజయం.. అప్పుడూ శివరాత్రి రోజే..!

T20 WCలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా <<19153355>>ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో FEB 15నే పాక్ను మన జట్టు ఓడించింది.
News February 16, 2026
ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం(ఫొటోలో)
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త, Ex MP లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు
News February 16, 2026
UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.


