News October 11, 2025
వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుసగా 3రోజులు సెలవులు రానున్నాయి. పలు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్కూళ్లకు శనివారం, ఆదివారం హాలిడేస్ ఉంటాయి. వీటికి తోడు సోమవారం(OCT 20) దీపావళి కావడంతో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీపావళి సెలబ్రేట్ చేసేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొనే పనిలో పడ్డారు.
Similar News
News October 11, 2025
2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI

AI టెక్నాలజీ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఇక మనదేశానికి ఉండదు. ఎందుకంటే స్వదేశీ AI 2026 ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ ఏడాది చివరికి మన సొంత ఏఐ సాంకేతికత పూర్తవుతుందని, ఆపై అందుబాటులోకి వస్తుందని MeitY సెక్రటరీ కృష్ణన్ తెలిపారు. ‘38వేల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU)తో ఉండే ఈ ఏఐతో కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగుపడుతుంది. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0లో ఇది కీలకమవుతుంది’ అని తెలిపారు.
News October 11, 2025
భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్గా షెర్రీ సింగ్

ఫిలిప్పీన్స్లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2025 పోటీల్లో INDకి చెందిన షెర్రీసింగ్ విజయం సాధించారు. ఈ పేజెంట్లో మన దేశానికి తొలికిరీటం తెచ్చి షెర్రీ చరిత్ర సృష్టించారు. నోయిడాలో జన్మించిన షెర్రీ ఫ్యాషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మెంటల్ హెల్త్పై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ‘ఈ విజయం నాది మాత్రమే కాదు. కలలు కనే ధైర్యం చేసిన ప్రతి స్త్రీకి చెందుతుంది.’ అని షెర్రీ అన్నారు.
News October 11, 2025
175 వద్ద రనౌట్.. జైస్వాల్ ఏమన్నారంటే?

WIతో జరుగుతున్న 2వ టెస్టులో 175 రన్స్ వద్ద ఔటవ్వడంపై జైస్వాల్ స్పందించారు. ఇది ఆటలో భాగమేనని తెలిపారు. తానెప్పుడూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్ను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తానన్నారు. బంతి మూవ్ అయిన టైంలో గంటసేపు క్రీజులో ఉండగలిగితే ఈజీగా రన్స్ చేయగలనని అనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని, మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.