News April 25, 2024

ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల రుణం

image

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ అప్పు తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలకు గాను రూ.47 వేల కోట్ల అప్పులకు కేంద్రం అనుమతిచ్చింది. కాగా ఈ నెల 2న ప్రభుత్వం రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది.

Similar News

News January 29, 2026

CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>CLRI<<>>) 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. Jr. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.53,628, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.39,545, MTSకు రూ.35,973 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://clri.org

News January 29, 2026

మొక్కజొన్న కంకిలో గింజలు చివరి వరకూ రావాలంటే?

image

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.

News January 29, 2026

ఏకాదశి ఉపవాసం ఉంటూ పఠించాల్సిన మంత్రాలివే..

image

* ఏకాదశి రోజు ప్రదోష వేళలో ఈ శ్లోకాన్ని పఠించాలి.
ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపపే హని|
భోక్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత||
* ఉపవాసం విరమించే సమయంలో(ద్వాదశి) పఠించాలి.
అజ్ఞాన తిమిరాంధస్య వ్రతేనానేన కేశవ|
ప్రసీద సుముఖోనాధ జ్ఞాన దృష్టి వ్రతోభవ||
వీటితో పాటు ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ పఠించడం శ్రేష్టం. ‘ఓం నమో నారాయణాయ’ అష్టాక్షరి మంత్రం, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి.