News August 28, 2024

30న వనమహోత్సవం.. ఒక్క రోజే లక్ష మొక్కలు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 30న వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 21, 2025

వీరవాసరంలో రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

image

వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ ZPHSలో సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO నారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి. పూర్ణచంద్రరావు ఆదివారం తెలిపారు. ఒక్కో మండలం నుంచి 11 ఉత్తమ ప్రదర్శనలు ఈ మేళాలో కొలువుదీరనున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదిక దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

News December 21, 2025

రేపు భీమవరానికి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

image

అటల్-మోదీ సుపరిపాలన బైక్ ర్యాలీ సోమవారం భీమవరం చేరుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ యాత్రలో కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, సత్య కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా MLAలు పాల్గొంటారన్నారు. బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

News December 21, 2025

కాళ్ల: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

image

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ సి.నాగరాణి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పెదఅమీరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గీతాబాయ్, సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.