News August 28, 2024
30న విజయనగరంలో జాబ్ మేళా

పలు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయనగరం జిల్లా ఉపాధి శాఖాధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 30న వివిధ కంపెనీల్లో 540 ఉద్యోగాల భర్తీకి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు http://rb.gy/9r3mcb లింక్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 10, 2026
VZM: పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం

పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే పోషణ్ పక్వాడా కార్యక్రమానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం తన ఛాంబర్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం & పోషకాహారం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
News April 10, 2026
ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం: కలెక్టర్

జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై CM చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ అంశాలపై చర్చించారని చెప్పారు. ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం సాధించిందని, విద్యుత్, RTC, రిజిస్ట్రేషన్ల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విజయనగరం వరకు అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారన్నారు.
News April 10, 2026
VZM: ‘ఏక మొత్తంలో పన్ను చెల్లిస్తే 5 శాతం రిబిట్’

ఆస్తి పన్నులను 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏకమొత్తంలో చెల్లించిన వారికి 5 శాతం రిబేటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు విజయనగరం నగర పాలక కమిషనర్ బాలస్వామి గురువారం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నులు, ఖాళీ స్థలాల పన్నులపై ఏక మొత్తంలో చెల్లించాలనుకునేవారు 50 శాతం రాయితీతో ఏప్రిల్ నెలాఖరు వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


