News March 9, 2025
30వ తేదీ నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల 12న ముగుస్తాయి. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చైత్ర మాసంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. ఈ పవిత్రమైన రోజున శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది.
Similar News
News March 16, 2025
అమరజీవి త్యాగం మరువలేనిది: జిల్లా ఎస్పీ

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.
News March 16, 2025
రూమ్లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?: కోహ్లీ

ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని BCCI విధించిన తాజా నిబంధనపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మ్యాచుల్లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్ ఇస్తుంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేకానీ మ్యాచ్ ముగిశాక రూమ్లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా? కుటుంబాలు మాతో ఉండటం ఎంత అవసరమో కొంతమందికి తెలియట్లేదు’ అని పేర్కొన్నారు.
News March 16, 2025
ఉండవల్లి: హడ్కో- సీఆర్డీఏ మధ్య ఒప్పందం

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.