News March 22, 2024

30న కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

కడప జిల్లాలో ఈ నెల 31 తేదీన చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించినట్లు టీడీపీ అధిష్ఠానం వెల్లడించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో 30వ తేదీన మైదుకూరులో ప్రజాగళం సమావేశంతో పాటు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని టీడీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు తెలిపారు.

Similar News

News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.

News July 3, 2024

కడప: ఎమ్మెస్సీకి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: వైవీయూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శాఖాధిపతి ఆచార్య తుమ్మలకుంట శివప్రతాప్ తెలిపారు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. సందేహాలకు ఎం.శశికుమార్
(898559792)ను సంప్రదించాలన్నారు.

News July 2, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.రామచంద్రయ్య నామినేషన్

image

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో ఆయన రాష్ట్ర మంత్రులతో కలిసి తన నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయనపై వైసీపీ నేతలు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఆయనను అనర్హుడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన ఆ స్థానానికి నామినేషన్ వేశారు.