News April 27, 2024
30న టంగుటూరు రానున్న సీఎం జగన్

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.
Similar News
News April 23, 2025
నేడు ప్రకాశం జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడంతో వారి మృతదేహానికి నివాళి అర్పించడానికి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రానున్నారు. అంతిమయాత్రలో సీఎం పాల్గొంటారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
News April 23, 2025
చంద్రబాబే లిక్కర్ స్కాం చేశారు: తాటిపర్తి

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.
News April 23, 2025
ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.