News December 26, 2024
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు: అనంత ఎస్పీ
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి జనవరి 17 వరకు నీలం సంజీవరెడ్డి మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషులు 5,242, మహిళలు 1,237 మంది హాజరవుతారని అన్నారు.
Similar News
News February 5, 2025
పరిటాల సునీతను ఆప్యాయంగా పలకరించిన జేసీ
అనంతపురంలో ‘అనంత ఉద్యాన సమ్మేళనం’ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఉందన్న చర్చ ఉంది. 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరగా అప్పటి నుంచి రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి.
News February 5, 2025
బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్నకు ఈ నెల 6న క్రీడాకారుల ఎంపిక
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు 8వ ఏపీ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. బుధవారం అనంతపురంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ కే.నరేంద్ర చౌదరి మాట్లాడారు. ఛాంపియన్ షిప్నకు స్థానిక అశోక్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 6న 8 గంటలకు బాలురు, బాలికల టీమ్లను ఎంపిక చేస్తామని తెలిపారు.
News February 5, 2025
అనంత: ఆటో డ్రైవర్పై హిజ్రాల దాడి.. వివరణ
అనంతపురం సమీపంలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రం చెరువు కట్ట వద్ద ఇటీవల ఓ ఆటో డ్రైవర్పై హిజ్రాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హిజ్రాలు వివరణ ఇచ్చారు. తమ ఆత్మ రక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ వల్ల ఎవరికీ హాని జరగదని అన్నారు. బీ.సముద్రం పోలీసులు మాట్లాడుతూ.. హిజ్రాలు ఇబ్బందులు కలిగిస్తే తమకు తెలపాలన్నారు. తప్పు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.