News March 29, 2025
30 తరాలైన YCP గెలవదు: ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాశినాయన ఆశ్రమానికి 23 హెక్టార్ల స్థలం కావాలని 2023లో నేను లేఖ రాస్తే YCP ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మరోసారి కేంద్ర అటవీ శాఖ మంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తే 13ఎకరాలు ఇస్తామని ఆయన చెప్పారు. డైనోసార్లాగా వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది. 30ఏళ్లు కాదు కదా.. 30 తరాలైన వైసీపీ గెలవదు’ అని ఢిల్లీలో ఎమ్మెల్యే అన్నారు.
Similar News
News December 19, 2025
కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.
News December 19, 2025
కడప: ప్రజలకు APS RTC గుడ్ న్యూస్..!

YSR కడప జిల్లాలోని ప్రజలకు APS RTC శుభవార్త తెలిపింది. APS RTC కార్గో విభాగం డిసెంబర్ 20 నుంచి 2026 జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 84 ముఖ్య పట్టణాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో, 50 కేజీల వరకు సరుకులను నేరుగా ఇంటి వద్దకే చేరవేసే ఈ సేవ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 19, 2025
కడప: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మంచిగా ఉండమని చెప్పినందుకు బంధువు నరసింహుడిని చంపిన నిందితుడు నాగరాజుకు శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టు యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. నిందితుడు తన బంధువును 2021లో జమ్మలమడుగులోని ఓ తోటలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి సత్యకుమారి శుక్రవారం శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.


