News October 23, 2024

BRICSలో చేరేందుకు 30+ కంట్రీస్ ఆసక్తి: పుతిన్

image

BRICSలో జాయిన్ అయ్యేందుకు 30+ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు. తమ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాల ఆసక్తిని విస్మరించకూడదని చెప్పారు. అదే టైమ్‌లో బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం, సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడం అవసరమన్నారు. తీవ్రమైన ప్రాంతీయ వివాదాలపై డిస్కస్ చేస్తామన్నారు. UNకు BRICS పోటీగా మారొచ్చన్న సందేహాలున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 16, 2025

రేపు ఉదయం 9.30 గంటలకు..

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. విద్యార్థుల భవిష్యత్తుకు ఇవి ఎంతో కీలకం. వారు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలి. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలి. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలి. Way2News తరఫున రేపటి నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ ALL THE BEST.

News March 16, 2025

ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

image

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

News March 16, 2025

గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

image

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.

error: Content is protected !!