News September 6, 2025

గోవా షిప్‌యార్డ్‌లో 30 పోస్టులు

image

<>గోవా షిప్‌యార్డ్<<>> లిమిటెడ్‌లో 30 జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. BE, B.Tech, BSc(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల ఉద్యోగ అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్ట్ బేసిక్ కింద మూడేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అవసరమైతే మరో ఏడాది పొడిగిస్తారు.

Similar News

News September 6, 2025

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

image

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత ఆర్చర్లు వెన్నం సురేఖ, రిషభ్ యాదవ్ సత్తా చాటారు. సెమీ ఫైనల్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చైనీస్ తైపీ జట్టుపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల తేడాతో నెగ్గారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌ను వీరు ఎదుర్కొంటారు.

News September 6, 2025

GST ఎఫెక్ట్.. ఫార్చునర్‌పై రూ.3.49 లక్షల తగ్గింపు

image

జీఎస్టీ శ్లాబుల మార్పుల వేళ <<17624320>>టాటా<<>>, మహీంద్రా బాటలోనే టొయోటా కూడా కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫార్చునర్‌పై అత్యధికంగా రూ.3.49లక్షల వరకు తగ్గనున్నట్లు తెలిపింది. గ్లాంజాపై రూ.85,300 వరకు, టైసోర్‌పై రూ.1.11 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.8లక్షల వరకు, హైలక్స్‌పై రూ.2.52లక్షల వరకు, వెల్‌ఫైర్‌పై రూ.2.78లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇవి ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయంది.

News September 6, 2025

మాక్రాన్‌కు మోదీ ఫోన్.. వివిధ అంశాలపై చర్చ

image

ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగడంపై చర్చించినట్లు చెప్పారు. అంతర్జాతీయ అంశాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేపట్టాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా మాట్లాడినట్లు మోదీ వెల్లడించారు.