News April 19, 2024
30% చక్కెరను తగ్గించాం: నెస్లే

పిల్లలకు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్లో 3గ్రాములు అదనంగా చక్కెర వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది. భారత్లో తయారు చేస్తున్నఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత 5ఏళ్లలో 30% తగ్గించినట్లు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనకబడిన ఆఫ్రికా దేశాల్లో నెస్లే నుంచి వచ్చే బేబీ ప్రొడక్టుల్లో చక్కెర పర్సంటేజ్ ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.
Similar News
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.
News November 25, 2025
పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.


