News April 19, 2024
30% చక్కెరను తగ్గించాం: నెస్లే

పిల్లలకు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్లో 3గ్రాములు అదనంగా చక్కెర వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది. భారత్లో తయారు చేస్తున్నఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత 5ఏళ్లలో 30% తగ్గించినట్లు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనకబడిన ఆఫ్రికా దేశాల్లో నెస్లే నుంచి వచ్చే బేబీ ప్రొడక్టుల్లో చక్కెర పర్సంటేజ్ ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.
Similar News
News November 20, 2025
గంభీర్పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్కతా పిచ్ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News November 20, 2025
విశ్వాన్ని నడిపించే అత్యున్నత శక్తి ‘విష్ణువు’

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం|
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||
పవిత్రతకు మూలం, శుభాలకు ఆరంభం విష్ణుమూర్తియే. అతి పవిత్రమైన, అతి మంగళకరమైన ఆ దేవదేవుడను దేవతలే దైవంగా కొలిచి, ఆరాధిస్తారు. ఈ లోకంలోని సకల జీవులకు ఆయనే ఆశ్రయమిస్తాడని నమ్ముతారు. ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రతి జీవికి ఆయనే స్థిరమైన ఆధారం. సరైన మార్గాన్ని చూపించే గురువు విష్ణు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


