News April 6, 2024

జరిమానాల రూపంలో రైల్వేశాఖకు రూ.300కోట్లు

image

గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో జరిమానాల రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. టికెట్ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్ చేయకుండా లగేజ్ తరలించడం, తదితర కారణాలతో మొత్తం 46.26 లక్షల కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. ముంబయి డివిజన్ పరిధిలో 20.56 లక్షల కేసులకు గాను రూ.115.29కోట్లు వసూలు చేసి తొలిస్థానంలో నిలిచింది. భుసావల్ డివిజన్‌లో 8.34లక్షల కేసులకు గాను రూ.66.33 కోట్లు వసూలయ్యాయి.

Similar News

News January 5, 2026

కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

image

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.

News January 5, 2026

మానస పూజకు నియమాలేంటి?

image

శివ మానస పూజకు ఏకాగ్రతే ప్రధానమైన నియమం. అంతకుమంచి నియమాలు ఏమీ ఉండవు. పూజ చేసే సమయంలో మనసు ఇతరుల మీదకు మళ్లకుండా చూసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని చేయడం ఉత్తమం. ఒకవేళ వీలుకాకపోతే, పవిత్రమైన భావనతో ఎప్పుడైనా చేయవచ్చు. కోపం, ద్వేషం వంటి వికారాలను వదిలి, ప్రేమతో శివుడిని స్మరించాలి. శరీరమే దేవాలయమని భావించి, లోపల ఉన్న శివుడిని దర్శించుకోవడమే ఇందులోని అసలైన నియమం.

News January 5, 2026

నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు

image

AP: కేంద్రం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించనుంది. ఇందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. మొన్నటి వరకు ఉపాధి హామీ పథకంలో 100రోజుల పనిదినాలకే అవకాశం ఉండగా, ప్రస్తుతం 125 రోజులకు పెంచారు. గ్రామసభలు, అవగాహన కోసం పథకం నిర్వహణ ఖర్చుల నుంచి రూ.2వేల చొప్పున ఖర్చు చేయొచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చింది.