News April 6, 2024
జరిమానాల రూపంలో రైల్వేశాఖకు రూ.300కోట్లు
గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో జరిమానాల రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. టికెట్ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్ చేయకుండా లగేజ్ తరలించడం, తదితర కారణాలతో మొత్తం 46.26 లక్షల కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. ముంబయి డివిజన్ పరిధిలో 20.56 లక్షల కేసులకు గాను రూ.115.29కోట్లు వసూలు చేసి తొలిస్థానంలో నిలిచింది. భుసావల్ డివిజన్లో 8.34లక్షల కేసులకు గాను రూ.66.33 కోట్లు వసూలయ్యాయి.
Similar News
News October 8, 2024
హరియాణా విజయం ప్రజాస్వామ్య విజయం: మోదీ
నవరాత్రి సమయంలో హరియాణాలో గెలవడం శుభసూచకమని PM నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో PM మాట్లాడారు. ‘హరియాణా విజయం ప్రజాస్వామ్య విజయం. కార్యకర్తల కృషితోనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. జమ్మూ కశ్మీర్లో గెలిచిన కాంగ్రెస్-ఎన్సీ కూటమికి నా అభినందనలు. JKలో మా ఓటింగ్ శాతం పెరగడంతో గర్వంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
News October 8, 2024
ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే..
ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా కేంద్రం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.
News October 8, 2024
ISS రష్యన్ సెగ్మెంట్ నుంచి ఎయిర్ లీకేజీ
అంతరిక్ష కేంద్రం (ISS)లోని రష్యన్ విభాగంలో గాలి లీక్ అవుతుండడంపై నాసా ఆందోళన వ్యక్తం చేసింది. జ్వెజ్డా మాడ్యూల్ PrK వెస్టిబ్యూల్లో 2019లో మొదటిసారిగా లీకేజీని గుర్తించారు. ఏప్రిల్ 2024 నాటికి రోజుకు 1.7 కేజీల గాలి లీకేజీ పెరిగినట్టు తేలింది. దీని వల్ల వ్యోమగాముల నివాస అనుకూల పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, లీకేజీ నియంత్రణలో కొంత పురోగతి సాధిస్తున్నట్లు నాసా తెలిపింది.