News August 28, 2024
30న వనమహోత్సవం.. ఒక్క రోజే లక్ష మొక్కలు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 30న వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
Similar News
News September 29, 2024
జగన్కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ
ఏపీ మాజీ సీఎం జగన్కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News September 29, 2024
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై చీటింగ్ కేసు
ఏలూరు మాజీ MLA ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. త్రీ-టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో ఏలూరులోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన తనను ఆదుకుంటానని, వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పిన ఆళ్ల నాని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అవుటుపల్లి నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో నానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.
News September 29, 2024
TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?
TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.