News January 27, 2025

31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

image

ఈనెల 31న TTD పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు X వేదికగా తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది.

Similar News

News March 9, 2026

బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

image

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్నిమెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.

News March 9, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 157 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 157 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 12,967 మంది విద్యార్థులకు గానూ 12,810 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

News March 9, 2026

ఏలూరు జిల్లాకు 86.7 కి.మీల కొత్తదారి

image

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకు రెండు వరుసల హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹.368 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే హైదరాబాద్ – రాజమండ్రి ప్రయాణ దూరం తగ్గుతుంది. సుమారు 86.7 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణంతో 100 ఏజెన్సీ గ్రామాలు, 30 మైదాన ప్రాంత గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.