News April 13, 2025
క్షిపణి దాడిలో 31 మంది మృతి

ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 31 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.
Similar News
News April 15, 2025
టీటీడీలో 2 వేల మంది మా వాళ్లే: భూమన

AP: టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని YCP నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు. ‘గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. నిజమైతే టీటీడీ ఈఓ, ఛైర్మన్ను తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News April 15, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 15, 2025
SC వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్.. ఆ వెంటనే DSC?

AP: జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM CBN ప్రకటించిన విషయం తెలిసిందే.