News January 27, 2025

31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

image

ఈనెల 31న TTD పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు X వేదికగా తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది.

Similar News

News March 14, 2025

NZB: హోలీ ప్రత్యేకం.. పూర్ణం భక్ష్యాలు, నేతి బొబ్బట్లు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం సకల సంప్రదాయాలకు నిలయం. మహారాష్ట్ర సంప్రదాయం అధికం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. ఈ వేళ విందు భోజనంలో నేతి బొబ్బట్లు, కోవా, కొబ్బరి, పూర్ణం భక్ష్యాలను చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి స్థిర నివాసం చేసుకుంటుందని భక్తుల విశ్వాసం. 

News March 14, 2025

MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

image

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.

News March 14, 2025

పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

image

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.

error: Content is protected !!