News March 27, 2025
నెలన్నరలో 325 మంది మావోలు హతం: ఛత్తీస్గఢ్ సీఎం

ఛత్తీస్గఢ్లో నెలన్నరలో 325 మంది మావోయిస్టులు హతమైనట్లు ఆ రాష్ట్ర CM విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. మరో 2 వేల మంది అరెస్టు లేదా లొంగిపోయినట్లు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మావోయిస్టుల ప్రభావం ఉందన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. బస్తర్ ప్రాంతం మినహా ఎక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా వారి జాడ లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు CM తెలిపారు.
Similar News
News March 30, 2025
సంక్రాంతికి పొలిమేర-3: డైరెక్టర్

చిన్న సినిమాలుగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘పొలిమేర’ 1&2లకు సీక్వెల్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. ‘ఇది పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో ఉంటుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తాం. ఇందులో ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తారు’ అని చెప్పారు. కాగా ఆయన డైరెక్షన్ చేసిన 28 డిగ్రీస్ మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.
News March 30, 2025
కొలికపూడిపై సీఎం ఆగ్రహం?

AP: వరుసగా వివాదాలకు కారణమవుతున్న టీడీపీ ఎమ్మెల్యే <<15917608>>కొలికపూడి శ్రీనివాసరావు<<>> తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఎక్కడా లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకు వస్తున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎంపీ కేశినేని చిన్నిలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరైనా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే పనిచేయాలని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
News March 30, 2025
పరీక్షల భయం.. అమ్మాయి ఆత్మహత్య

వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి భరించలేక తమిళనాడు చెన్నైకి చెందిన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు NEETలో ఫెయిల్ అయిన దేవదర్శిని.. మేలో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. తరచూ విఫలం అవుతుండటం, సమయం వృథా కావడం, కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఆమె ఇవాళ ఉరేసుకుంది.