News January 18, 2025
త్వరలో 3,260 పోస్టుల భర్తీ!

TG: విద్యుత్ శాఖలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. త్వరలోనే 3,260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్పీడీసీఎల్-వరంగల్లో 2,212 జేఎల్ఎం, 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్, ఎస్పీడీసీఎల్ లో 600 JLM, 300 సబ్ ఇంజినీర్, 100 AE పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Similar News
News December 6, 2025
95% కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో

95% నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు ఇండిగో తెలిపింది. నిన్న 700కు పైగా సర్వీసులు అందుబాటులో ఉంచగలిగామని ఈరోజు మొత్తంలో 1500 ఫ్లైట్లను నడుపుతున్నామని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘138 గమ్యస్థానాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించాం. మా ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సంక్షోభంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని చెప్పింది.
News December 6, 2025
కోట్ల మందికి తాగునీటి కొరత!

2050 నాటికి కోట్ల మందికి తాగునీరు అందని పరిస్థితి తలెత్తవచ్చని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. వియన్నాకు చెందిన కాంప్లెక్సిటీ సైన్స్ హబ్, ప్రపంచ బ్యాంక్ కలిసి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని 100కు పైగా నగరాలను పరిశీలించాయి. ఇష్టారీతిన విస్తరించుకుంటున్న నగరాల వలన 220M మందికి స్వచ్ఛమైన నీరు అందదని వెల్లడించింది. సరైన ప్రణాళిక ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని సూచించింది.
News December 6, 2025
రాకెట్ వేగంతో దూసుకుపోతున్న భారత్ ‘ఫిన్టెక్’

స్కాన్.. పే.. డన్. ఈ భారత UPI చెల్లింపుల టెక్నాలజీ రాకెట్ వేగంతో గ్లోబల్ ఆధిపత్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, సింగపూర్, UAE, ఖతర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్లో ఇది పనిచేస్తోంది. EAST ASIA సహా మరో 8 దేశాల్లో దీని అమలుకు చర్చిస్తున్నట్లు ఫైనాన్షియల్ SEC నాగరాజు తెలిపారు. వరల్డ్ వైడ్గా 20+కంట్రీలను UPI ఎనేబుల్డ్ చేయాలన్నది లక్ష్యం. UPI USERS 50CRకి చేరగా INDIAలో 49CR ఉన్నారు.


