News December 8, 2024

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.33 కోట్లు

image

TG: రిటైర్డ్ కార్మికులు, అధికారులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి లాభాల్లో వాటాగా రూ.33 కోట్లను చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నెల 12న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎండీ బలరామ్ తెలిపారు.

Similar News

News December 8, 2025

ఎకరాల భూమి ఉన్నా.. అమ్మలేరు..!

image

ప్రత్తిపాడు మండలం చింతలూరులో దశాబ్దాలుగా భూములన్నీ ఈనాం పరిధిలో ఉండటంతో, భూ పట్టాలు లేక రైతులు భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా గ్రామంలోని కొందరు పెత్తందారులు రైతులు పండించుకుంటున్న భూమిపై పన్నులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ ఈనాం సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News December 8, 2025

భారత్‌లో విమానయాన సంస్థలకు డిమాండ్: రామ్మోహన్ నాయుడు

image

భారత్‌లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా కాంపిటీటర్స్ ఉండాలని, దేశంలో మరో 5 పెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. <<18503378>>ఇండిగో సంక్షోభం<<>>పై చర్యలు తీసుకోవడంతోపాటు దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటామని చెప్పారు.

News December 8, 2025

డబ్బు విలువ ఎందుకు తగ్గుతుందంటే?

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు <<18505684>>విలువ<<>> ఎలా తగ్గుతుందనే డౌట్ చాలామందికి రావొచ్చు. ద్రవ్యోల్బణం అంటే వస్తు, సేవల ధరలు సాధారణంగా పెరగడం. దీని ఫలితంగా డబ్బుకున్న కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ఉదా.. 6% ద్రవ్యోల్బణం ఉంటే ఈ రోజు ₹100తో కొన్న వస్తువును భవిష్యత్తులో ₹106 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మీ దగ్గరున్న డబ్బుతో గతంలో కొన్నంత ఎక్కువ వస్తువులను ఫ్యూచర్‌లో కొనలేరు. ఇలా డబ్బు విలువ తగ్గుతుంది.