News August 7, 2024
వారికి 33శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

AP: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM <<13800264>>చంద్రబాబు<<>> ప్రకటించారు. ఇది పార్లమెంట్లో చట్టరూపం దాల్చేలా బాధ్యత తీసుకుంటామన్నారు. ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాం. చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా, చేనేతలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తాం’ అని సీఎం తెలిపారు.
Similar News
News January 20, 2026
మహానంది: ముగ్గురు సస్పెన్షన్.. ఒకరు డిస్మిస్

మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విచారణ చేసిన ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని గుర్తించి పాఠశాల హెచ్ఎంతో పాటు డిప్యూటీ వార్డెన్, మరో టీచర్ను సస్పెండ్ చేయడంతో పాటు ఒక సీఈఆర్టీని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఐటీడీఏ పీవో శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
News January 20, 2026
ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 20, 2026
3 నెలల ముందుగానే వచ్చేశాయ్!

TG: సాధారణంగా ఏప్రిల్లో మార్కెట్లోకి వచ్చే మామిడిపండ్లు ఈసారి 3 నెలల ముందుగానే వచ్చేశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ, ఎంజే, గడ్డి అన్నారం తదితర మార్కెట్లలో బంగినపల్లి రకం కేజీ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. చప్పగా, పుల్లగా ఉండటంతో మామిడి కొనేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. హైబ్రిడ్ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో మామిడి ముందుగానే వస్తోందని పేర్కొన్నారు.


