News July 4, 2024
కాలుష్యంతో 10 నగరాల్లో ఏటా 33వేలమంది మృతి: స్టడీ

కాలుష్యం వల్ల భారత్లోని 10 నగరాల్లో ఏటా సగటున 33వేల మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008-2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. పౌరులను కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను భారత్ కచ్చితంగా అనుసరించాలని హెచ్చరించింది. అత్యధికంగా ఢిల్లీలో ఏడాదికి 12వేలమంది మరణిస్తున్నారని స్పష్టం చేసింది.
Similar News
News April 9, 2026
పాలిసెట్.. మరికొన్ని గంటలే ఛాన్స్

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే <<19588593>>పాలిసెట్<<>> దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేసుకోని విద్యార్థులు ఈ రాత్రిలోగా చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ పాసైనవారు, ఇటీవల పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <
News April 9, 2026
IPL: నేడు LSGvsKKR.. గెలిచేదెవరు?

ఈరోజు కోల్కతా వేదికగా LSG, KKR 7.30PMకి తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు LSG రెండు మ్యాచులు ఆడి ఒక దాంట్లో గెలిచింది. అటు బౌలింగ్లో తడబడుతున్న KKR ఇంకా బోణీ కొట్టలేదు. 3 మ్యాచుల్లో 2 ఓడింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. గత మ్యాచుకు దూరమైన నరైన్ ఈరోజు ఆడే అవకాశముంది. గాయపడ్డ వరుణ్ ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా నేటి మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని CricBuzz పేర్కొంది.
News April 9, 2026
కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>


