News September 24, 2025

334 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లో 334 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. టెన్త్ అర్హత గల 27ఏళ్ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

Similar News

News September 24, 2025

GOLD: పదేళ్లలో దాదాపు రూ.లక్ష పెరిగింది

image

గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹72వేలుగా ఉండేది. ఇప్పుడు ₹1.16లక్షలకు చేరింది. అంటే 9 నెలల్లోనే ₹44వేలు పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం. 10గ్రా. బంగారం ధర 1970లో ₹184, 1975లో ₹540 మాత్రమే. 2005లో ₹7000 ఉండగా, 2015లో ₹26,343, 2020లో ₹50వేలు టచ్ చేసింది. కరోనా వల్ల ₹36వేలకు దిగొచ్చి తిరిగి పుంజుకుంది. పదేళ్లలో దాదాపు ₹లక్ష పెరిగింది.

News September 24, 2025

171 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏతోపాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు 23-36 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 13. మరిన్ని వివరాలకు <>https://indianbank.bank.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News September 24, 2025

మండలానికి ఒక జూనియర్ కాలేజీ: లోకేశ్

image

AP: మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ‘గత సర్కారు ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేసింది. హైస్కూల్ ప్లస్ విధానంతో కాలేజీల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా పోయారు. మేము ఆ విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రభుత్వ కాలేజీల్లో 40% అడ్మిషన్లు మెరుగుపర్చాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశాం’ అని చెప్పారు.