News July 31, 2024

35 మంది సీఐలను బదిలీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ

image

రాయలసీమ రేంజ్ (ZONE- 4) పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 16 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఇద్దరు సీఐలకు పోస్టింగ్ లభించింది.

Similar News

News December 23, 2025

కర్నూలు: శరీరం నుజ్జునుజ్జు

image

ఆదోని మండలం ఆరేకల్లు మెడికల్ కాలేజీ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై భారీ వాహనాలు వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. మృతుడికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News December 23, 2025

కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

image

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్‌కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.

News December 23, 2025

కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

image

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్‌కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.