News April 4, 2024

జూనియర్ ఉద్యోగులకు 35-45% జీతాలు పెరగొచ్చు: పేజ్ గ్రూప్

image

ఈ ఏడాది ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ‘మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్’ నివేదిక వెల్లడించింది. మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్లకు 20-30 శాతం వరకు పెంపు ఉంటుందని చెప్పింది. నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టిసారించాయని తెలిపింది. వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం ఉన్నవారి అవసరం పెరిగిందని పేర్కొంది.

Similar News

News February 2, 2026

TODAY HEADLINES

image

* నిర్మలమ్మ పద్దు.. ₹53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు
* ఇది చరిత్రాత్మక బడ్జెట్: PM
* ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్
* దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: భట్టి
* కేసీఆర్‌ను 4.50 గంటలు విచారించిన సిట్
* T20WC: INDతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాక్
* కవలలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు

News February 2, 2026

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.

News February 2, 2026

అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య: పోలీసులు

image

AP: అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ‘అంబటిపై 16 కేసులు ఉన్నాయి. సీఎం చంద్రబాబును అసభ్యంగా దూషించారు. పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేయకపోతే అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అంబటిని 14 రోజులపాటు రిమాండ్ ఇవ్వాలి. లేదంటే ఆయనకు ప్రాణహాని ఉంది’ అని పేర్కొన్నారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.