News September 26, 2024
పదేళ్లలో ఏపీకి రూ.35,491 కోట్ల కేంద్ర నిధులు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఏపీకి 2014-24 మధ్య కాలంలో రూ.35491.57 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన మేరకు కేంద్రం బదులిచ్చింది. పదేళ్లలో ఆర్థిక లోటు భర్తీ కింద రూ.16,078.76 కోట్లు, ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,750 కోట్లు, రాజధాని నగరంలో మౌలిక వసతుల డెవలప్మెంట్కు రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15,147 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.
Similar News
News November 19, 2025
అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News November 19, 2025
వన్డేల్లో తొలి ప్లేయర్గా రికార్డు

వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫుల్ మెంబర్ టీమ్స్ అన్నింటిపై సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా నిలిచారు. అటు వన్డేల్లో హోప్ 19 సెంచరీలు నమోదు చేశారు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ ఫుల్ మెంబర్స్ టీమ్స్. కాగా ఇవాళ్టి రెండో వన్డేలో వెస్టిండీస్పై NZ గెలిచింది.
News November 19, 2025
సూసైడ్ బాంబర్: క్లాసులకు డుమ్మా.. ఆర్నెళ్లు అజ్ఞాతం!

ఢిల్లీ పేలుళ్ల బాంబర్ ఉమర్కు అల్ ఫలాహ్ వర్సిటీ స్వేచ్ఛ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అతడు క్లాస్లకు సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా 15 ని.లు మాత్రమే ఉండేవాడని సహచర వైద్యులు విచారణలో తెలిపారు. 2023లో ఆర్నెళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడన్నారు. ఉమర్ను తొలగించాల్సి ఉన్నాతిరిగి రాగానే వర్సిటీ విధుల్లో చేర్చుకుందని చెప్పారు. పోలీసుల వరుస విచారణలతో డాక్టర్లు, స్టూడెంట్లు వర్సిటీ నుంచి వెళ్లిపోతున్నారు.


