News September 26, 2024

పదేళ్లలో ఏపీకి రూ.35,491 కోట్ల కేంద్ర నిధులు

image

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఏపీకి 2014-24 మధ్య కాలంలో రూ.35491.57 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన మేరకు కేంద్రం బదులిచ్చింది. పదేళ్లలో ఆర్థిక లోటు భర్తీ కింద రూ.16,078.76 కోట్లు, ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,750 కోట్లు, రాజధాని నగరంలో మౌలిక వసతుల డెవలప్‌మెంట్‌కు రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15,147 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.

Similar News

News November 22, 2025

నేను ఒరిజినల్: బాలకృష్ణ

image

ఈ రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడి ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సినిమాలు అసాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. ‘నా సినిమాల్లో అవసరమైతేనే సాంకేతికతను వాడుతా. ఈ రోజుల్లో ప్రతిదానికి టెక్నాలజీని వాడుతున్నారు. హీరోలు సెట్స్‌కు రాకుండా గ్రీన్ మ్యాట్ వేసుకొని షూట్ చేసేస్తున్నారు. నేను అలా కాదు ఒరిజినల్’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నటించిన అఖండ-2 DEC 5న రిలీజ్ కానుంది.

News November 22, 2025

HBTUలో 29 టీచింగ్ పోస్టులు

image

యూపీలోని హర్‌కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hbtu.ac.in/

News November 22, 2025

రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

image

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్‌ను ఇస్తుందని సూచించారు. SHARE IT