News April 11, 2024

36,596 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 36,596 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా.. రైతుల ఖాతాలలో 12 కోట్ల 66 లక్షల రూపాయల జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరిచందన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

Similar News

News December 12, 2025

నాకు ఆ విషయం తెలియదు: మంత్రి కోమటిరెడ్డి

image

సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “టికెట్ల ధర పెంచబోమని అసెంబ్లీలో చెప్పాను.. ఇకపై రేట్లు పెంచే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే తాజాగా జీవో విడుదలైందని, దీనిపై నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే ధరలు తగ్గాల్సిందేనని, సామాన్యుడిపై భారం పడనివ్వబోమని మంత్రి ఉద్ఘాటించారు.

News December 12, 2025

మూడవ విడత ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలు అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లిలో రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.

News December 12, 2025

నల్గొండ: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

image

రెండో విడతలో భాగంగా 10 మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.