News March 24, 2024
దేశంలో 370 సీట్లు.. ప్రతి బూత్లో 370 ఓట్లు: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో 17 స్థానాలు కాంగ్రెస్ గెలవదని.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరని రాష్ట్ర BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. పదాధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు.. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు BJPకి వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీల బలోపేతంపై చర్చించారు. ఏప్రిల్ 6న రాష్ట్రంలోని ప్రతి బూత్లో బీజేపీ టిఫిన్ బైటక్ నిర్వహించాలని సూచించారు.
Similar News
News July 11, 2025
బిజినెస్ అప్డేట్స్

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు
News July 11, 2025
రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.
News July 11, 2025
మూవీ ముచ్చట్లు

* ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ సిట్టింగ్స్.. తమన్తో ప్రభాస్
* ఓటీటీలోకి వచ్చేసిన ‘8 వసంతాలు’.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
* సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతున్న కలియుగం 2064
* సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’
* ఇవాళ థియేటర్లలోకి ‘ఓ భామ అయ్యో రామ’, ‘సూపర్ మ్యాన్’ సినిమాలు
* కార్తీ కొత్త మూవీ ‘మార్షల్’
* సోనీలివ్లో యాక్షన్ డ్రామా మూవీ ‘నరివెట్ట’ స్ట్రీమింగ్