News October 17, 2024
375 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు : కలెక్టర్

నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News November 27, 2025
నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
News November 27, 2025
NLG: మాజీ సైనికుల పిల్లలకు గుడ్ న్యూస్

మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.krb.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682-224820 నంబర్ కు సంప్రదించాలని కోరారు.
News November 27, 2025
NLG: రెండు డివిజన్లు.. 117 క్లస్టర్లు!

నల్లగొండ, చండూరు డివిజన్లో పరిధిలో 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్లో రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.


