News October 8, 2025
38 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి: ASF కలెక్టర్

జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ కోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీసీఐ, మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ సంవత్సరం 3 లక్షల 34 ఎకరాలలో పత్తిపంట సాగు చేశారు. 38 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందన్నారు.
Similar News
News October 8, 2025
వైవీయు నూతన వీసీగా రాజశేఖర్

కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా బెల్లంకొండ రాజశేఖర్ను అధికారులు నియమించారు. కొన్ని నెలలుగా ఇన్ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా ఇన్ఛార్జే ఉండటంతో నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్న బెల్లంకొండ రాజశేఖర్ను నియమించారు.
News October 8, 2025
దగ్గు సిరప్పై కేంద్రం కీలక ఆదేశాలు

దగ్గు సిరప్తో MP, రాజస్థాన్లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
News October 8, 2025
నామినేషన్ల దాఖలులో ‘కోడ్’ పాటించాలి: నల్గొండ ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాలకు అభ్యర్థులు ముందుగా పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.