News September 28, 2025

38 మంది మృతి.. TVK సెక్రటరీపై కేసు నమోదు

image

కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. TVK కరూర్ వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వీపీ మతియళగన్‌పై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పొలిటికల్ ర్యాలీలో నిబంధనలు ఉల్లంఘించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మతియళగన్‌‌ ఒక్కరిపైనే కేసు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు.

Similar News

News February 9, 2026

పబ్‌జీ ఆడుతుండగా 300 దాటిన BP.. మెదడు నరాలు చిట్లి మృతి

image

మేరఠ్‌(UP)కు చెందిన మహ్మద్ కైఫ్(22) 4నెలలుగా PUBG గేమ్‌కు అలవాటుపడ్డారు. శుక్రవారం హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చెవులు, ముక్కు నుంచి రక్తం కారిన అతనికి ట్రీట్‌మెంట్ చేసినా ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మెంటల్ ప్రెజర్‌తో BP 300 దాటి బ్రెయిన్‌లోని నరాలు చిట్లి రక్తస్రావమైనట్లు డాక్టర్లు తేల్చారు.

News February 9, 2026

దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 9, 2026

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.