News November 29, 2024

చెన్నైకి 380 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6గంటల్లో 8KMPH వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. చెన్నైకి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రేపు మధ్యాహ్నం కారైకాల్-మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర్లో తీరం దాటే అవకాశముందని చెప్పింది. దీంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని APSDMA వెల్లడించింది.

Similar News

News April 2, 2026

పంత్ ఓపెనర్‌గానే రావాలి: అశ్విన్

image

LSG కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పొజిషన్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైనప్పటికీ పంత్ ఆ స్థానాన్ని వదలొద్దని సూచించారు. పవర్ ప్లే తర్వాత వస్తే బౌలర్లు ఈజీగా కట్టడి చేస్తారని, అందుకే 14 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గానే రావాలని కోరారు. కోచ్ లాంగర్, LSG మేనేజ్‌మెంట్‌లో ఎవరైనా ఈ విషయంపై పంత్‌కు నచ్చజెప్పి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.

News April 2, 2026

ఆ థియేటర్లలో ఇక పర్సెంటేజీ సిస్టమ్: ఎగ్జిబిటర్ల నిర్ణయం

image

TG: రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీని ప్రకారం కలెక్షన్లలో తొలివారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% థియేటర్లకు అందనుంది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు అద్దె ప్రాతిపదికన చెల్లింపులు చేసే వారు. దీంతో లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్న తాము నష్టపోతున్నామని సదరు థియేటర్ల ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News April 2, 2026

కిడ్నీ ముఠా గుట్టురట్టు.. మూవీ తీయొచ్చేమో!

image

UP కాన్పూర్‌లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.