News April 25, 2024
39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్
నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.
Similar News
News January 22, 2025
రూ.6.91కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్: కర్నూలు కలెక్టర్
కర్నూలు జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య తలెత్తకుండా రూ.6.91 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు.
News January 22, 2025
‘జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయండి’
రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News January 21, 2025
నంద్యాల: కందులకు రూ.7,550ల మద్దతు ధర
రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధర రూ.7,550లతో ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందని మార్క్ఫెడ్ డీఎం హరినాథ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక రైతుకు రోజుకు 40 క్వింటాళ్ల పరిమితిని విధించినట్లు చెప్పారు. బుధవారం నుంచి ప్రతి రైతు సేవ కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.