News October 14, 2024

39,481 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించిన 39,481 జనరల్ డ్యూటీ(GD) కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటితో అప్లికేషన్ గడువు ముగియనుంది. పదో తరగతి పాసై, 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నవారు <>ssc.gov.in<<>> వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, ST, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మినహాయింపు ఉంటుంది. SSC GD అర్హత పరీక్ష 2025 జనవరి/ఫిబ్రవరిలో CBT పద్ధతిలో నిర్వహిస్తారు.

Similar News

News September 17, 2025

ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.

News September 17, 2025

ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్‌ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<> AICTE<<>> , కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.