News February 28, 2026

4న తిరుపతిలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని APSPDCL కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్, హీరో మోటార్ కార్ప్, అమర్ రాజా గ్రూప్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ, రాంకో సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు.

Similar News

News March 1, 2026

సంగారెడ్డి: రేపటి నుంచి 10th విద్యార్థులకు పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక పరీక్షలు-3 నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు అదివారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.

News March 1, 2026

తిరుపతి: ఇవాళ చికెన్ కొంటున్నారా.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.161 నుంచి రూ.165, మాంసం రూ.233 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.266 నుంచి రూ.285 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 1, 2026

చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

image

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.