News August 25, 2024

4 నుంచి తిరుమల బహ్మోత్సవాలు

image

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాల్లో భక్తులు, ఉద్యోగులు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది.

Similar News

News September 29, 2024

SVU : LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో 3/ 5 LLB ( NON – CBCS) 6, 9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 29, 2024

చిత్తూరు: జిల్లా ప్రజలకు గమనిక.

image

అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 2,69,677 మందికి సుమారు రూ.113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 1వ, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినంతో 3 వ తేదీ పంపిణీ చేస్తామని చెప్పారు.

News September 29, 2024

శ్రీవారి సేవకు రూ.కోటి టికెట్

image

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో ఉన్నారు. అలావచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నోరకాల ఆర్జితసేవలు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకమైన సేవ ఒకటి ఉంది. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈసేవ టికెట్ ధర అక్షరాల రూ.కోటి. ఈటికెట్ కొనుగోలుచేసిన భక్తులు ఆరోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం అష్టదళపాదపద్మారాధన ఉంటుంది. వివరాలకు TTD వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.