News January 18, 2026
4 రోజుల్లో ₹14,266 కోట్లు ఔట్

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) గతవారం ఏకంగా ₹14,266 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ భారీ అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాల భయాల నేపథ్యంలో విదేశీ సంస్థలు తమ పెట్టుబడులను విత్డ్రా చేసుకుంటున్నాయి. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) ₹16,174 కోట్లు పంప్ చేయడంతో మార్కెట్లు స్థిరంగా నిలబడగలిగాయి.
Similar News
News February 6, 2026
తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2026
260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News February 6, 2026
కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటే: పవన్ కళ్యాణ్

AP: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని, హిందూ దేవుళ్లను అవమానిస్తే మౌనం వీడాలని డిప్యూటీ CM పవన్ పిలుపునిచ్చారు. కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటేనన్నారు. ‘ఎవరి కర్మకు వారిని వదిలేసే పద్ధతి మారాలి. మన ధర్మాన్ని అవమానిస్తే పోరాడాల్సింది మనమే. భక్తులుగానే కాదు.. ధర్మ రక్షకులుగా మారాలి. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. మన విశ్వాసాలను కాపాడుకోవడమే’ అని SMలో పేర్కొన్నారు.


