News October 9, 2025

4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. RSK సిబ్బందికి మద్దతు ధర, ట్రక్ షీట్ విధానంపై శిక్షణలు పూర్తి చేయాలన్నారు.

Similar News

News October 10, 2025

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లాను అభివృద్ధిలో మొదటి 5 స్థానాల్లో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. గురువారం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. సివిల్ సప్లైస్ ద్వారా స్మార్ట్ రైస్ కార్డులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

News October 9, 2025

సానుకూల దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాలి: DRO

image

అర్జీదారుల సమస్యలను సానుకూల దృష్టితో పరిష్కరించాలని DRO శ్రీనివాసమూర్తి సూచించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పెండింగ్ మ్యుటేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని సందర్భాల్లో నిబంధనలను వివరించి, నోటీసుపై సంతకం తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

News October 9, 2025

బాణాది చెరువులో పడి వ్యక్తి మృతి

image

వేపాడ మండలం బాణాదిలో సంపర్తి ఆంజనేయులు (32) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుదర్శన్ వివరాల మేరకు.. అతను గ్రామానికి దగ్గరలో ఉన్న తమ్మ చెరువుకు దుస్తులు ఉతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.